Friday, December 31, 2021

ఒక పరిశీలన



నిన్నో మొన్నో ఇంట్లో ఎవరో టివి ఛానెల్స్ మారుస్తూ సాక్షి దగ్గర ఆగారు. ఏదో చర్చ నడుస్తోంది. యాంకర్ కాక ఇంకో ముగ్గురు కనిపిస్తున్నారు. ఒకరు పాత్రికేయుడు, ఒకరు YSRCP, ఇంకొకరు BJP. వీళ్ళు కాకుండా ఇంకొంతమంది ఫోన్లో ఉన్నట్టున్నారు. చర్చ వస్తువు మద్యపానానికి సంబంధించినది.

నేనీమధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అంత నిశితంగా పరిశీలించకపోవడంవల్ల ఇక్కడేమిజరుగుతోందో అంతగా అవగాహనలేదు. కాకపొతే, ఈ చర్చ కొద్దిసేపు విన్నతర్వాత నాకనిపించిన అభిప్రాయాలు ఇక్కడ:




ముందస్తు గమనిక:- నేనిక్కడున్న ఏ రాజకీయపక్షానికి మద్దతుదారునికాదు.




సోము వీర్రాజు అనేఆయన మద్యాన్ని INR 50 లకే విక్రయిస్తామని హామీ ఇచ్చినట్లున్నారు. దీనిమీద KTR ఏమన్నారు, దానికి BJP సమాధానమేమిటని ప్రశ్న. ఇది ప్రక్కన పెడితే, ఏ ఏ రాష్ట్రాల్లో మద్యం విక్రయంమీద ఎంత రాబడి వస్తోందో వివరించి, ఉత్తరప్రదేశ్ లో 30 కోట్ల ఆదాయం వస్తోంది కాబట్టి అక్కడ ప్రభుత్వం ప్రజలదగ్గరనుంది ఎక్కువగా దోచేస్తోందని దానికి బీజేపీ సమాధానమేమిటని ప్రశ్న. BJP తరపున మాట్లాడే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వరకే మాట్లాడాలి అని ఈ ప్రశ్నని దాటవేసేశారు ప్రతిసారి. YSRCP తరపున మాట్లాడినాయన తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలతో పోలిస్తే మద్యం మీద మన రాష్ట్ర ఆదాయం తక్కువేనని వాదించారు. అది వింటున్నప్పుడు నాక్కూడా అనిపించింది BJP వాదనలో పట్టులేదని.



కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించిందేమంటే, ఈ రాష్ట్రాల జనాభా సంఖ్య వేరే. జనాభా ప్రాతిపదికన చూస్తే ఆంధ్రప్రదేశ్ జనాభా (2021 లో) 5.46 కోట్లు, మద్యం మీద ఆదాయం 2021 లో 14,375. కోట్లు. తమిళనాడు జనాభా (2021 లో) 7.88 కోట్లు, మద్యం మీద ఆదాయం, 33,811.4 కోట్లు. కర్ణాటక జనాభా 6.84 కోట్లు, మద్యం మీద ఆదాయం 22,851 కోట్లు (2020-2021 లో). మహారాష్ట్రలో జనాభా 12.47 కోట్లు, మద్యం మీద ఆదాయం 15,090 కోట్లు (2020-2021 లో). ఉత్తరప్రదేశ్ జనాభా 24.1 కోట్లు, మద్యం మీద ఆదాయం 36000 కోట్లు. ఈ లెక్కన చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నా తమిళనాడు , కర్ణాటక ప్రజలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రజలు తక్కువగా మద్యం సేవిస్తున్నారు. కేరళ జనాభా 3.58 కోట్లు, మద్యం మీద ఆదాయం, 10,379.38 కోట్లు. ఇవన్నీ గూగుల్ లెక్కలు కాబట్టి కొంతవరకు కాకి లెక్కే అయ్యుంటుంది.



ఒకరకంగా మద్యం నిత్యావసర వస్తువుకింద వచ్చినట్లుగా అనిపించింది. ఇదీ మన పురోగతి.



ప్రజలని ఏదో ఒక మత్తులో ఉంచాలి, అది మద్యం కావచ్చు మతం కావచ్చు :)



~సూర్యుడు :-)

Wednesday, December 22, 2021

మూడు నవలలు

ఈ మధ్య ఓ మూడు నవలలు చదివాను. అవి Billy Summers by Stephen King, The Judge's List by John Grisham and Damascus Station by David McCloskey. మూడు నవలలు బాగున్నాయి, అదే వరుస క్రమంలో. 

 

Billy Summers ఒక sniper కథ. నేనింతకుమునుపెప్పుడు Stephen King నవలలు చదవలేదు, ఇదే మొదటిది. అంత గొప్పగా లేనప్పటికీ పరవాలేదు. 

 

The Judge's List ఒక న్యాయమూర్తి కథ. తనకు జరిగిన (perceived) అవమానాలకు, మోసాలకు ప్రతీకారంగా ఒక చిట్టా తయారు చేసి వాళ్ళందరిని ఎవరికీ దొరక్కుండా ఎలా చంపాడో వివరించే కథ. ఉత్కంతంగా ఉండి బాగుంది. 


Damascus Station is the best, love story, err, spy story or a Spy's Love Story 😀. వేళాకోళాల్ని ప్రక్కనపెడితే, నవల చాలా బాగుంది. సిరియా upraising నేపథ్యంలో జరిగిన కథ. స్పై నవలలు ఇష్టపడేవారు తప్పకుండ చావాల్సిన నవల. నవలా రచయిత David McCloskey CIA లో  పనిచేసి ఉండడం వల్ల నవలకు కొంత సాధికారత వచ్చిందనిపించింది. వ్రాసిన విధానం కూడా చాలా బాగుంది. 

 

ప్రస్తుతానికి Douglas London వ్రాసిన The Recruiter చదువుతున్నాను. ఇది నవల కాదు. ఒకరకంగా ఒక CIA మాజీ ఉద్యోగస్తుని ఆత్మకథలాంటిది. సాధారణంగా నాకు ఆత్మకథలు అంతగా నచ్చవు కానీ ఇందులో కొన్ని నిజంగా జరిగిన సంఘటనల్ని వివరించడంవల్ల ఇప్పటివరకు బాగానే ఉంది. 

 

కోవిద్-19 ఓమిక్రాన్  వైరస్ విపరీతంగా వ్యాపించే అవకాశాలుండడంవల్ల మామూలు మాములుగా కోవిద్-19 జాగ్రత్తలు అన్ని పాటించి ఆరోగ్యంగ ఉంటారని ఆశిస్తూ ... 


~సూర్యుడు 😷